పార్లమెంట్ ఎన్నికల్లో సర్వేలను తలదన్నేలా ఫలితాలు రాబోతున్నాయని బీజేపి నేత ఈటెల అన్నారు. గురువారం దేవరకొండలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ గత పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుకకు ఓటేయ్యండని చెప్పిన అభ్యర్ధి ఇప్పుడు కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్నాడని ఇప్పుడు ఆయన ఎవరిని ప్రశ్నిస్తాడని అన్నారు. పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు.