కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో జరిగే అభివృద్ధి పనులలో నాణ్యత ఉండాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. అధికారులు అలక్ష్యంగా ఉంటే సహించేది లేదని హెచ్చరించారు. హుజూర్నగర్లోని రెండు నియోజకవర్గాల్లో జరుగుతున్న పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్శాఖ ద్వారా 85 పనులకు 2 నియోజకవర్గాల్లో కొత్త, రెన్యూవల్ కలిపి రూ.124.65 కోట్ల పనులు జరుగుతున్నాయని అధికారులు వివరించారు.