పెంబి మండలంలోని తాటిగూడ గ్రామంలో ఉన్న జగదాంబ దేవి ఆలయంలో నిర్వహించే జగదాంబ దేవి, శ్రీరామనవమి జాతర మహోత్సవాలను విజయవంతం చేద్దామని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు కోరారు. గురువారం మధ్యాహ్నం ఆ దేవాలయ కమిటీ సభ్యులతో కలిసి ఆయన జాతర మహోత్సవ పోస్టర్లను విడుదల చేశారు. ఏప్రిల్ 9 నుండి 17వ తేదీ వరకు జగదాంబ దేవి ఆలయంలో జాతర మహోత్సవాలు జరగనున్నాయని వెల్లడించారు. అందరూ హాజరై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సూచించారు.