రేషన్ బియ్యం ఇప్పించాలని ఆందోళన
తమకు మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ చేయాలని పెంబి మండలంలోని సెట్పల్లి, రాముగూడా గ్రామాల ఆదివాసి ప్రజలు ఆందోళన నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం వారు మాట్లాడుతూ మూడు నెలల నుండి ప్రతినెలా రేషన్ డీలర్ వచ్చి బయోమెట్రిక్ తీసుకొని బియ్యం ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బియ్యం రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు మూడు నెలల రేషన్ బియ్యం ఇప్పించాలని ఆదివాసులు కోరారు.