మహబూబాబాద్లో ముగ్గురు ఏఈఓలను అకారణంగా సస్పెండ్ చేసిన కారణంగా మంగళవారం నిర్మల్ జిల్లా ముధోల్ డివిజన్ ఏఈఓలు లోకేశ్వరంలోని రైతువేదికలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఏఈఓ మండల ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ మాట్లాడుతూ సస్పెన్షన్ పై సమగ్ర విచారణ జరిపి అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఏఈఓలపై ఉన్న సస్పెన్షన్ని వెంటనే ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు.