సోన్ మండలం సిద్దులకుంట గ్రామంలో తల్లి తండ్రి లేని అనాధ పిల్లలను బాలల పరిరక్షణ అధికారులు మంగళవారం అక్కున చేర్చుకున్నారు. వారిని జిల్లా కేంద్రంలోని బాలసదనంలో చేర్పించారు. ఈ సందర్భంగా బాలల పరిరక్షణ అధికారులు ఓస శ్రీనివాస్, షేర్ నరేందర్ లు మాట్లాడుతూ. గ్రామాల్లో అనాధ పిల్లలుంటే 1098 కు సమాచారం అందించాలని కోరారు. ఇందులో సామాజిక కార్యకర్తలు లక్ష్మణ్, నరేందర్, మమత, గంగామణి తదితరులున్నారు.