క్యూ లైన్లో వృద్ధుడు మృతి
దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రక్రియ శుక్రవారం కొనసాగుతోంది. ఈ క్రమంలో రాజస్థాన్లోని భిల్వారా జిల్లా పూర్ పట్టణంలో విషాద ఘటన జరిగింది. ఛగన్లాల్ (79) అనే వృద్ధుడు ఓటు వేసేందుకు మనవడితో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చాడు. క్యూల్ లైన్లో ఇతర ఓటర్లతో పాటు నిల్చున్నాడు. అయితే ఎండల వల్ల ఆయన స్పృహ తప్పి పడిపోయాడు. పోలింగ్ కేంద్రం వద్దే ఆయన ప్రాణాలు కోల్పోయాడు.