పార్లమెంట్ నుంచి సస్పెన్షన్కు గురైన ప్రతిపక్ష ఎంపీలు గురువారం ఆందోళనకు దిగారు. పాత పార్లమెంట్ భవనం నుంచి సెంట్రల్ ఢిల్లీలోని విజయ్ చౌక్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అంటూ ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. కాగా, లోక్సభలో భద్రత వైఫల్యంపై ప్రతిపక్షాలు ఉభయసభల్లో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. దాంతో ఇప్పటివరకు 143 మంది ఎంపీలను సస్పెండ్ అయ్యారు.