పద్మశ్రీ అవార్డు గ్రహీత కమలా పూజారి మృతి

80చూసినవారు
పద్మశ్రీ అవార్డు గ్రహీత కమలా పూజారి మృతి
ఒడిశాకు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ సేంద్రియ రైతు కమలా పూజారి మృతి చెందారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఈరోజు మృతి చెందినట్లు సీఎంవో వర్గాలు తెలిపాయి. 74 ఏళ్ల ఆమెకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వ్యవసాయ రంగానికి ఆమె చేసిన గణనీయమైన కృషికి 2019 లో ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. ఆమె వందలాది దేశీయ వరి రకాలను సంరక్షించడంలో ప్రసిద్ధి చెందారు.
Job Suitcase

Jobs near you