ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల మూల్యాంకన కేంద్రంను జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని కోరుతూ తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ 475 ఆధ్వర్యంలో ఇంటర్ విద్యా జిల్లా నోడల్ అధికారి బొప్పరాతి నారాయణకు స్థానిక కళాశాలలో శనివారం వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా శాఖ అధ్యక్షుడు కొట్టాల తిరుపతిరెడ్డి, మహిళా కార్యదర్శి ఎం. శ్రీలత, అధ్యాపకులు మాజీద్ పాల్గొన్నారు.