వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ (వీడియో)
ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ స్థానానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం వారణాసి కలెక్టర్ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. అంతకు ముందు కాశీలోని దశాశ్వమేధ ఘాట్ వద్ద ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడే క్రూజ్ షిప్లో పర్యటించారు. కాలభైరవ ఆలయంలో పూజల్లో పాల్గొన్నారు. అనంతరం నామినేషన్ దాఖలు చేశారు.