16 ఏళ్లుగా అత్తమామల చేతిలో బందీగా ఉన్న మహిళను రక్షించిన పోలీసులు

61చూసినవారు
16 ఏళ్లుగా అత్తమామల చేతిలో బందీగా ఉన్న మహిళను రక్షించిన పోలీసులు
2006లో పెళ్లి చేసుకొని, మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో అత్త వారింట్లో బందీగా ఉన్న ఓ మహిళను దాదాపు 16 ఏళ్ల తర్వాత శనివారం పోలీసులు రక్షించారు. 2008 నుంచి తన కూతురిని చూసేందుకు తల్లిదండ్రులను అనుమతించడం లేదని, భర్త అత్తమామలు ఆమెను వేధింపులకు గురిచేస్తున్నారని నార్సింగ్‌పూర్‌కు చెందిన బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేశారు. సదరు మహిళను ఆమె సంతానానికి కూడా దూరంగా, ఒంటరిగా ఉంచారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్