కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ ఎంపీ సీటును వదులుకున్నారు. ఇటీవల ఎన్నికల్లో రాహుల్ యూపీలోని రాయ్ బరేలితో పాటు వయనాడ్ నుంచి భారీ మెజారిటీతో ఎంపీగా గెలిచారు. తాజాగా రాయ్ బరేలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తానని రాహుల్.. ఖర్గేతో చెప్పారు. దీంతో ఉపఎన్నికల్లో వయనాడ్ నుంచి పోటీ చేయాలని ప్రియాంకాగాంధీ నిర్ణయం తీసుకున్నారు.