ప్రమాదవశాత్తూ సర్వీసు తుపాకీ పేలి ఓ రైల్వే
కానిస్టేబుల్ దుర్మరణం చెందాడు. ఈ ఘటన చత్తీస్గఢ్లోని రాయ్పూర్ రైల్వే స్టేషన్లో శనివారం జరిగింది. అలాగే మరో ప్రయాణికుడు కూడా గాయ
పడ్డాడు. దినేష్ చంద్ర (30) అనే కానిస్టేబుల్ ఎస్-2 కోచ్ నుంచి కిందకు దిగుతుండగా తుపాకీ పేలింది. తూటా నేరుగా అతడి ఛాతిలోకి దూసుకుపోవడంతో అతడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.