చెట్లకొమ్మల తొలగింపు, మరమ్మతుల కారణంగా గురువారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు సరూర్ నగర్ డివిజినల్ ఇంజినీర్ కే. రామకృష్ణ తెలిపారు. 11కేవీ లెక్చరర్స్ కాలనీ, మథర్ డెయిరీ ఫీడర్ల పరిధిలోని కాలనీ లలో ఉదయం 10. 30 నుంచి మధ్యాహ్నం 1. 30 గంటల వరకు, 11కేవీ సీతారామాపురం ఫీడర్ పరిధిలోని కాలనీలలో మధ్యాహ్నం 2. 30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని ఆయన కోరారు.