ఈద్ ఉల్ ఫితర్ వేడుకలను షాద్ నగర్ నియోజకవర్గంలోని ముస్లింలందరూ ఆనందంగా జరుపుకొని అల్లా దీవెనలను అందుకోవాలని షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డి ఆకాంక్షించారు. నెల రోజుల కఠిన ఉపవాస దీక్షల అనంతరం జరుపుకునే రంజాన్ పండుగను ముస్లింలు తమ బంధు మిత్రులందరితో సంతోషంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. గురువారం రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.