మంటల్లో ఆస్తి నష్టం బాధాకరం: ఎమ్మెల్యే

56చూసినవారు
విద్యుత్ షాక్ తో ప్రమాదం సంభవించి ఆ మంటల్లో సుమారు రూ. 5 లక్షల ఫర్నిచర్ కాలిపోవడం ఎంతో బాధాకరమని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం పరమేశ్వర థియేటర్ రోడ్డులో ఉన్న జెపి ఫర్నిచర్ షాపును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా షాపు యజమాని సంగేమ్ గ్రామానికి చెందిన రహీంను పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాన్ని అడిగి తెలుసుకున్నారు.