వ్యవసాయ సీజన్ వచ్చింది కావున రైతులకు విద్యుత్ కోతలు లేకుండా చూడాలని ఎంపీపీ పిన్నింటి మధుసూదన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం విద్య, విద్యుత్, వ్యవసాయ శాఖల అధికారులతో ఎంపీపీ పిన్నింటి మధుసూదన్ రెడ్డి సోమవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో సమస్యలపై చర్చించారు.