2024- 25 సంవత్సరానికి సంబంధించి ప్రవేశ పెట్టబోయే బడ్జెట్ పైన అన్ని విభాగాల అధికారులతో రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిమ సింగ్ సమీక్ష నిర్వహించారు. శనివారం కలెక్టర్ ప్రతిమ సింగ్ స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ వెంకన్న తదితర సిబ్బందితో మాట్లాడారు. భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా బడ్జెట్ ప్రవేశపెట్టే అంశంలో ఎలాంటి నివేదికలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.