కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఎన్నికల ర్యాలీలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్షాపై రాహుల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ గతంలో పరువునష్టం కేసు దాఖలైన సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ట్రయల్ కోర్టు విచారణపై స్టే విధిస్తూ తీర్పు వెలువరించింది.