తెలంగాణలో ఎండిపోయిన పంటలకు ఎకరానికి రూ.25,000 చొప్పున పరిహారం ఇవ్వాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పంటలు ఎండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని విమర్శించారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ కక్షగట్టి తెచ్చిన కరువు అన్నారు. పంటలు ఎండిపోవడంతో అన్నదాతల బతుకులు ఆగమయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.