సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు సాయి కీర్తన, వైష్ణవి రాష్ట్రస్థాయి ప్రతిభా పురస్కారాలు అందుకున్నారు. రవీంద్రభారతిలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పురస్కారాలను అందబేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం, కమిషనర్ అండ్ డైరెక్టర్ దేవసేన, ప్రధానోపాధ్యాయురాలు వరగంటి అనురాధ పాల్గొన్నారు.