మంచి ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ యోగ అభ్యాసం చేయాలని యోగ గురువు బిక్షపతి రెడ్డి అన్నారు. శనివారం ఏఎస్ విద్యావిహార్ పాఠశాలలో ప్రతిరోజు యోగా శిక్షణ తరగతులు జరుగుతున్నాయని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. శిక్షణ తరగతుల్లో రకరకాల యోగ అభ్యసనాలు నేర్పడం జరుగుతుందని, బీపీ షుగర్ థైరాయిడ్, కొలెస్ట్రాల్, తదితర సమస్యలకు యోగ ద్వారా పరిష్కారం లభిస్తుందని అన్నారు.