అనారోగ్యంగా ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఎన్నికల విధులు నుంచి మినహాయింపు ఇవ్వాలని యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. సంగారెడ్డి లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన మాట్లాడుతూ శిక్షణ కేంద్రంలోని పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు కల్పించాలని కోరారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు పాల్గొన్నారు.