వర్షాకాలం మొదలైన నేపథ్యంలో రైతులకు శాస్త్రవేత్తలు పలు సూచనలు చేశారు. కోసిన పంటలను ఆరుబయట ఉండనీయకండా.. గోదాములు, మార్కెట్ షెడ్డులు, ఇంట్లో ఉంచాలని తెలిపారు. వరి, మక్కజొన్న పంటలకు సంబంధించి మడుల్లో నీరు నిల్వకుండా గండ్లు కొట్టాలని సూచించారు. కోసే దశలో ఉన్న కూరగాయలను వెంటనే కోసేయాలని, వర్షాలు వచ్చే సూచనలు ఉన్నప్పుడు పంట పొలాలకు పురుగు మందులు, ఎరువులు వేయొద్దని తెలిపారు.