కేజ్రీవాల్ ఆరోగ్యంపై తీహార్ జైలు అధికారుల సంచలన నివేదిక
మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై తీహార్ జైలు అధికారులు సంచలన నివేదిక ఇచ్చారు. షుగర్ వ్యాధితో బాధపడుతున్నప్పటికీ కేజ్రీవాల్కు ఇన్సులిన్ అవసరం పెద్దగా లేదని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాకు అధికారులు నివేదిక అందించారు. కేజ్రీవాల్ బ్లడ్ సుగర్ స్థాయిలు అదుపులోనే ఉన్నాయని, మందులు వాడితే సరిపోతుందని ఆర్ఎమ్ఎల్ ఆస్పత్రి సూచించిందని తెలిపారు.