మోదీ కేబినెట్లో దక్కిన పోస్టులపై ఎన్సీపీ తర్వాత తాజాగా శివసేనలో అసంతృప్తి జ్వాలలు రేగాయి. మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే పారధ్యంలోని శివసేన తమకు ఆఫర్ చేసిన కేబినెట్ బెర్త్లపై అసహనం వహించింది. ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం సైతం తమకు సహాయ మంత్రి పదవి ఇవ్వడంతో అసంతృప్తి వ్యక్తం చేసింది. తమకు ఒక కేబినెట్ మంత్రి పదవినైనా కేటాయించాలని శివసేన కోరింది.