దుబ్బాక నియోజకవర్గంలోని తన సొంత గ్రామమైన అక్బర్పేట-భూంపల్లి మండలంలోని బొప్పాపూర్ గ్రామంలో మెదక్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులను ఆత్మీయంగా పలుకరిస్తూ, ఎంపిగా బరిలో నిలిచానని, కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఆయన వెంట బీజేపీ నాయకులు ఉన్నారు.