

ఇండియన్ ఆర్మీపై మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం అనుచిత వ్యాఖ్యలు (వీడియో)
ఇండియన్ ఆర్మీపై మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం జగదీష్ దేవదా అనుచిత వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ని ఉద్దేశిస్తూ ఆయన చేసిన ప్రసంగంలో ప్రజలతో పాటు సైన్యం దేశ ప్రధాని నరేంద్ర మోదీ పాదాలకు నమస్కరించాలని అన్నారు. "ఈ రోజు దేశం మొత్తం, సైన్యం ప్రధాని మోడీ తీసుకున్న బలమైన చర్యకు ఆయన పాదాలకు నమస్కరిస్తుంది. ఆయనకు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టాలి’’ అని జగదీష్ దేవదా వ్యాఖ్యానించారు.