ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్ ను ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన ఘటన మండల కేంద్రం ములుగులో రాజీవ్ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై విజయ్ కుమార్ తెలిపిన వివరాలు జగిత్యాల జిల్లా రామకృష్ణాపూర్ గ్రామానికి చెందిన బూషణమైన నాంపల్లి తమ బందువుల ఇంటికి వెళ్ళేందుకు కరీంనగర్ నుండి హైదరాబాద్ కు ద్విచక్రవాహనం పై బయలుదేరాడు. ములుగు వద్దకు రాగానే ద్విచక్రవాహనం అదుపు తప్పి తలకి తీవ్ర గాయాలయి మృతి చెందాడు.