మద్దూరు మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్, బిఆర్ఎస్ కార్యకర్తలు, మండల అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, రేభర్తీ ఎంపీటీసీ కూరెళ్ల రాజు గౌడ్ ఆధ్వర్యంలో, బీజేపీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ సమక్షంలో గురువారం బీజేపీ పార్టీలో చేరారు. బూర నర్సయ్య గౌడ్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.