క్రోది నామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకొని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు దౌల్తాబాద్ మండలం అధ్యక్షుడు సయ్యద్ రహిమొద్దీన్ శుభాకాంక్షలు తెలిపారు. మర్కుక్ మండలం లోని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో మంగళవారం ఆయనను మండల నాయకులతో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్లమెంటు ఎన్నికల పై సమీక్షా సమావేశం నిర్వహించారు.