కోహెడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఆధ్వర్యంలో పొలియో చుక్కల శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్స్, గ్రామస్తులతో కలిసి స్థానిక ఎంపిటిసి కొనే శేఖర్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 0-5 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరి బాధ్యతగా పోలియో చుక్కలు వేయించుకోవాలన్నారు.