సిద్దిపేట పట్టణంలోని హనుమాన్ నగర్ 11 కేవీ విద్యుత్ ఫీడర్ మరమ్మతుల కారణంగా మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని పట్టణ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ సుధాకర్ రెడ్డి సోమవారం తెలిపారు. ముర్షద్ గడ్డ, సాయివిద్యానగర్, గణేష్ నగర్, హనుమాన్ నగర్, శ్రీసాయినగర్ పరిసర ప్రాంతాల్లో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు సరఫరాకు అంతరాయం ఉంటుందని తెలిపారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.