దక్షిణాఫ్రికాలో ఈ ఏడాది ఆఖర్లో శ్రీలంక, పాకిస్తాన్ క్రికెట్ జట్లు పర్యటించనున్నాయి. ఈ రెండు దేశాలతో క్రికెట్ షెడ్యూల్లను దక్షిణాఫ్రికా క్రికెట్బోర్డు శుక్రవారం దృశీకరించింది. శ్రీలంకతో రెండు టెస్ట్ల సిరీస్ మాత్రమే ఆడనుంది. అలాగే పాకిస్తాన్తో మూడేసి వన్డే, టి20 సిరీస్లతోపాటు రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో సఫారీ జట్టు తలపడనుంది. పాక్తో తొలిటెస్ట్కు ప్రిటోరియా, రెండో టెస్ట్కు కేప్టౌన్లో జరగనున్నాయి.