కలియుగ దైవం తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం భక్తులు తరలివస్తుంటారు. ఈ క్రమంలోనే స్వామికి భక్తులు కానుకల రూపంలో భారీగా సమర్పించుకున్నారు. దీంతో సోమవారం ఒక్కరోజులో శ్రీవారి హుండీకి రూ.5.48 కోట్లు ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు నిన్న 69,314 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా, 25,165మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని తెలిపారు.