TG: సాగర్ కుడి కాలువ ద్వారా గత మూడునెలలుగా ఏపీ ఇష్టారాజ్యంగా రోజుకు 10వేల క్యూసెక్కుల సామర్థ్యంతో జలాల తరలిస్తున్నారని మాజీ మంత్రి KTR ఆరోపించారు. నది జలాలను ఏపీ తన్నుకు పోతున్నా సీఎం రేవంత్ సర్కారు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. వచ్చేది వేసవి, తాగునీళ్లకు, సాగునీళ్లకు కష్టం అని తెలిసి కూడా గాలిమోటర్లో ఢిల్లీ ట్రిప్పులు కొడుతున్న సీఎంకి అన్నదాతల గోస ఏం తెలుసు అని KTR మండిపడ్డారు.