క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్(2025) సీజన్ 18 మరో రెండు రోజుల్లో ప్రారంభంకానుంది. అయితే, మార్చి 23న చెన్నైతో జరిగే మ్యాచ్కి ముంబై ఇండియన్స్ కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని హార్దిక్ పాండ్య వెల్లడించాడు. గత ఎడిషన్లో పాండ్య స్లో ఓవరేట్కు గురయ్యాడు. దీంతో అతడిపై నిషేధం పడింది. ఈ నేపథ్యంలో చెన్నైతో జరిగే మ్యాచ్కి అతడు అందుబాటులో ఉండడు.