దారుణ హత్యకు గురైన మృతుడి వివరాలు లభ్యం

57చూసినవారు
దారుణ హత్యకు గురైన మృతుడి వివరాలు లభ్యం
నల్గొండ జిల్లా డిండి మండలం చెరుకుపల్లి సరిహద్దుల్లో శనివారం దారుణ హత్యకు గురైన వ్యక్తి వివరాలు లభ్యమయ్యాయి. మృతుడు కేతెపల్లి మండలం కొప్పోలు గ్రామానికి చెందిన జగదీష్(34)గా గుర్తించారు. మృతుడి అత్తగారి ఊరు డిండి మండలం కామెపల్లిగా తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు హంతకులు ఎవరనేది పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. హత్యకు గల కారణాలు ఒకటి రెండు రోజుల్లో వెలుగులోకి రానున్నాయి.

సంబంధిత పోస్ట్