శాస్త్రీయ వైఖరులు పెంపొందించడంలో జన విజ్ఞాన వేదిక చేస్తున్న కృషి అభినందనీయమని కోదాడ ఎంపీపీ మల్లెల రాణి, మండల విద్యాధికారి సలీం షరీఫ్ లు అన్నారు. శనివారం కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో మండల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ విజేతలకు బహుమతులుతులు పంపిణీ చేశారు. ప్రథమ జడ్. పి. హెచ్. ఎస్ పాలారం, ద్వితీయ బహుమతులు శాంతినగర్, సింగారం పాఠశాలలు పొందాయి. ఈ కార్యక్రమంలో డివిజన్ బాధ్యులు డి.ఎన్ స్వామి, జాఫర్ ఉన్నారు.