డ్రగ్స్ ,సైబర్ నేరాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని ఏఎస్ఐ మల్సూర్ తెలిపారు. బుధవారం నడి గూడెం మండల కేంద్రంలోని గురుకుల కళాశాలలో విద్యార్థులకు డ్రగ్స్ సైబర్ నేరాలపై పోలీస్ కళాబృందాల ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గురుకుల కళాశాల ప్రిన్సిపల్ చింతల వాణి, వైస్ ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు అధ్యాపకులు మూర్తి , పోలీస్ సిబ్బంది వీరబాబు, ప్రతాప్ రెడ్డి, కళాబృందం యల్లయ్య ఉన్నారు.