ఆప్ కార్యాలయంలో పంద్రాగస్టు వేడుకలు

251చూసినవారు
ఆప్ కార్యాలయంలో పంద్రాగస్టు వేడుకలు
ఆమ్ ఆద్మీ పార్టీ సూర్యాపేట కార్యాలయంలో 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకకు ముఖ్య అతిధిగా జిల్లా కన్వీనర్ లింగిడి వెంకటేశ్వర్లు పాల్గొని జెండా ఆవిష్కరణ చేసారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఎంతోమంది పోరాటం చేసి సంపాదించిన స్వాతంత్య్రం దేశంలోని ప్రతిపౌరుడు రక్షించుకోవాలని ఆప్ కార్యకర్తలకు తెలిపారు. దేశంలో ఉన్న అవినీతి, అవిద్యా, నిరుద్యోగం, అంటరానితనం తొలగిపోవడానికి ప్రతి ఆప్ కార్యకర్త పనిచేయాలని, బాధ్యత గల పౌరులుగా దేశాన్ని కాపాడాలని కోరినారు. కరోనా మహమ్మారిని ధైర్యంగా ప్రజలు ఎదుర్కోవాలని ప్రభుత్వాలు విద్యా, వైద్య రంగాలను బలోపేతం చేసి ప్రజలందరికి ఉచితంగా అందించాలని ఆప్ పార్టీ ప్రభుత్వం డిల్లీలో విద్యా వైద్యాన్ని అభివృద్ధిచేస్తూ.. ప్రజలకు ఉచితంగా అందిస్తుందని ఇదే విధానం దేశం మొత్తంలో అమలుచేసి స్వాతంత్య్ర నిజమైన ఫలాలు సమాజానికి అందించాలని అందుకోసం ఆప్ వాలంటీర్లు నిత్యం కృషిచెయ్యాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సెక్రటరీ బి.మనోహర్, స్పోక్ పర్సన్ కే. సుధాకర్ రెడ్డి ఆప్ వాలంటీర్లు నాగమణి, ఉప్పలయ్య, సైదులు, సంతోష్, సోమయ్య పాల్గొన్నారు.