అమెరికాలోని అట్లాంటా నగరంలో జరుగుతున్న 18వ ఆట మహాసభలకు టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సోమవారం 3వ రోజు ఆట మహాసభలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో స్ప్రెడ్ ఇండియా ఫౌండేషన్ అధ్యక్షులు పటేల్ శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు. వారం రోజులుగా పటేల్ రమేష్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయనతోపాటు తెలుగు రాష్ట్రాల నుండి ప్రముఖులు అటా మహాసభలకు వెళ్లారు.