TG: రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ నేడు(శుక్రవారం) ఖమ్మం జిల్లాలోని భద్రాద్రిలో పర్యటించనున్నారు. భద్రాచలంలోని సీతారామ చంద్ర దేవస్థానాన్ని సందర్శించి ఆలయంంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో కవులు, కళాకారులతో కూడా ఆయన సమావేశం కానున్నారు. గవర్నర్ పర్యటనకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు.