ఢిల్లీలో బీజేపీ నిరసనలో ఉద్రిక్తత (వీడియో)
దేశ రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. ప్రజల నీటి కష్టాలు తీవ్రతరం కావడంతో సమస్యను పరిష్కరించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు నిరసన చేపట్టారు. ఓఖ్లాలోని జల్ బోర్డు ఫిల్లింగ్ పంపు వద్ద బీజేపీ నేత రమేష్ బిధూరి ఆధ్వర్యంలో పలువురు నిరసన చేపట్టారు. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ ఫిరంగులు ప్రయోగించారు.