కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డకు సీఎం రేవంత్ బృందం చేరుకుంది. మేడిగడ్డ బ్యారేజిలో కుంగిన పిల్లర్లను సీఎం రేవంత్ బృందం పరిశీలిస్తోంది. సీఎం తో పాటుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ పలువురు నేతలు ఉన్నారు. పరిశీలన అనంతరం ప్రాజెక్టుపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.