'టెక్ ఉద్యోగాల్లో మహిళల వాటా తక్కువే'

76చూసినవారు
'టెక్ ఉద్యోగాల్లో మహిళల వాటా తక్కువే'
దేశంలోని టెక్ ఉద్యోగాల్లో లింగ అసమానత కనిపిస్తోందని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్) బోర్డు డైరెక్టర్, ముకేశ్ అంబానీ కుమార్తె ఈశా అంబానీ అన్నారు. టెక్ ఉద్యోగాల్లో కేవలం 36 శాతం మంది మహిళలే ఉన్నారని తెలిపారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మేథమ్యాటిక్స్(స్టెమ్)లో మహిళా పట్టభద్రులు 43 శాతంగా ఉండగా.. శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, టెక్నాలజీస్ట్‌లుగా వీరు 14 శాతం మందే ఉన్నారని ఈశా వివరించారు.

సంబంధిత పోస్ట్