పూణె కారు ప్రమాదం కేసులో మైనర్ నిందితుడికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు అశ్విని కోష్ట తల్లి మమతా కోష్ట దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ఘటనతో షాకింగ్కు గురైనట్లు తెలిపింది. న్యాయవ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని.. అయితే తాము పడుతున్న బాధను కూడా కోర్టు కూడా ఎరగాలని పేర్కొన్నారు. మే 19న మద్యం మత్తులో ఓ మైనర్ బాలుడు వేగంగా కారు నడిపి ఇద్దరు టెకీల మరణానికి కారణమైన విషయం తెలిసిందే.