వారు విభజన చట్టం అమలుకు కృషి చేయాలి: సీఎం రేవంత్‌

59చూసినవారు
వారు విభజన చట్టం అమలుకు కృషి చేయాలి: సీఎం రేవంత్‌
కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ నుంచి మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, శ్రీనివాస్‌ వర్మకు అభినందనలు తెలియజేశారు. విభజన చట్టం అమలు, కేంద్రం నుంచి తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధుల విడుదలకు కృషి చేయాలని వారిని కోరారు. ప్రాజెక్టుల సాధనకు చర్యలు తీసుకోవాలన్నారు.