ప్రజలకు కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ కీలక విజ్ఞప్తి చేశారు. పాదాలను తాకడంపై నిషేధం ఉందని.. కాళ్లు పట్టుకుంటే పనులు కావు అని తెలిపారు. మధ్యప్రదేశ్లోని తికమ్గఢ్లో గల తన కార్యాలయం బయట ఆయన ఒక బోర్డు ఏర్పాటుచేశారు. ‘పాదాలను తాకడంపై నిషేధం ఉంది. అలా చేసిన వారికి ఎటువంటి పనులూ అప్పగించేది లేదు’ అంటూ అందులో రాయించారు. ఇది చూసిన ప్రజలు, రాజకీయ నేతలు షాక్ అవుతున్నారు. మంత్రి చేసిన ఈ పనిని ప్రశంసిస్తున్నారు.